ఫిలిప్పీన్స్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు దుర్మరణం చెందారు.వారిద్దరినీ అనంతపురం జిల్లాకు చెందిన వంశీ, రేవంత్ కుమార్ గా గుర్తించారు.
ఆ ఇద్దరూ ఫిలిప్పీన్స్ లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు.వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది.
ఈ ప్రమాదంలో వారు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తుంది.
వారి మృతదేహాలను స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న లాక్ డౌన్ నేపధ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిపేశారు.
దీంతో వీరిని సొంత రాష్ట్రానికి ఎలా తీసుకురావాలో అర్ధం కాని పరిస్థితి నెలకొని ఉంది.మరో వైపు ఈ ఘటనపై విపక్ష నేత చంద్రబాబు కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాసారు.
ఫిలిప్పీన్స్ లో చనిపోయిన తెలుగు విద్యార్ధులని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు.మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఆ మృతదేహాల రాక ఆధారపడి ఉంది.