భీమ్లా నాయక్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు.భీమ్లా నాయక్ 2022 సంక్రాంతికి వస్తుండగా హరి హర వీరమల్లు సినిమా 2022 ఏప్రిల్ 29న రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో, హరీష్ శంకర్ కాంబోలో మరో సినిమా రాబోతున్నాయి.అయితే ఈ రెండు సినిమాల తర్వాతనే నెక్స్ట్ సినిమాలు చేస్తాడని టాక్.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టార్గెట్ తో యువ దర్శకులు ఇద్దరు కథలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది.అందులో ఒకరు విరాట పర్వం ఫేమ్ వేణు ఊడుగుల ఒకరు కాగా.
శ్రీదేవి సోడా సెంటర్ డైరక్టర్ కరుణ కుమార్ ఒకరని తెలుస్తుంది.
ఇద్దరు టాలెంటెడ్ డైరక్టర్స్ పవన్ కోసం అద్భుతమైన కథలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ డైరక్టర్స్ మాములు కథలతో కాకుండా సోషల్ కాజ్ తో సినిమాలు చేస్తున్నారు.తప్పకుండా పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరితో సినిమాలు చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండేళ్ల దాకా షెడ్యూల్ బిజీ ఉండగా అయినా సరే పవన్ తో సూపర్ సినిమాలు చేయాలని చూస్తున్నారు ఈ ఇద్దరి దర్శకులు.మరి ఈ డైరక్టర్స్ కు పవన్ ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.