ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు డార్లింగ్ ప్రభాస్.ఇటీవలే ఈయన నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
అయినా కూడా ప్రభాస్ వెంట పడే దర్శక నిర్మాతలు కోకొల్లలు.నార్త్ లోను ఈయనకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది.
దీంతో ప్రభాస్ తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ డైరెక్టర్లు మాత్రమే కాదు కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రెసెంట్ ఈయన చేతిలో అన్ని కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
ఈ సినిమాల కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈయన చేస్తున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి.
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో ఈయన స్పిరిట్ అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం విదితమే.
ప్రెసెంట్ సందీప్ వంగ బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేస్తున్నాడు.
రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమాను సందీప్ తెరకెక్కిస్తున్నాడు.ఆ తర్వాత ఈయన ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.కాగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఇద్దరు కథానాయికలు పోటీ పడుతున్నారని తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ హీరోయిన్ ను వెతుకుతున్నట్టు అందుకోసం తెగ కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా కోసం కొంత మంది హీరోయిన్స్ ను అనుకోగా.లాస్ట్ కి వాళ్ళల్లో ఇద్దరినీ హోల్డ్ లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఆ ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరు కన్నడ బ్యూటీ కాగా మరొకరు బాలీవుడ్ బ్యూటీ అని తెలుస్తుంది.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ లు అని తెలుస్తుంది.ఈ ఇద్దరు డార్లింగ్ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది.మరి వీరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలో డైరెక్టర్ కు కూడా తలనొప్పిగా మారిందట.చిత్ర యూనిట్ కూడా వీరిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయబోతున్నారు అని తెలుస్తుంది.ప్రభాస్ కు జోడీగా కియారా అయితే బాగుంటుంది అని కొంత మంది అంటుంటే.లేదు రష్మిక అయితే బాగుంటుంది అని మరికొంత మంది అంటున్నారు.
అయితే స్పిరిట్ సినిమాకు ఎవరిని సెలెక్ట్ చేస్తారో అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.