వైరల్ వీడియో: పాముల పంతం చివరకు చేపకు మేలు చేసింది...!

రెండు పాముల పంతం చివరికి చేపకు మేలు చేసినట్లయింది.ఒక చేప పాముకు విందుగా ఆరగించడానికి ప్రయత్నం కాస్త బెడిసి కొట్టడంతో ఆ చెప్పకు పునర్జన్మ లభించింది.

 Two Snakes Fight For Fish Viral Video, Social Media, Viral Video, Fish Safe, Fis-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కన్ష నేషనల్ పార్క్ లో ఓ పాము ఆకలితో ఉన్న సమయంలో నీటిలో బాగా వెతికి చివరికి ఒక చేపను తన తల సహాయంతో పట్టుకుంది.ఇలా చేపని పట్టుకున్న తర్వాత ఆ పాము చేపలు తినడం కోసం నీటిలో నుంచి బయటకు తీసుకొని వచ్చింది.

అయితే సరిగ్గా ఇదే సమయంలో మరో పాము ఆ చేపను తీసుకు వెళ్తున్న సమయంలో నీటిలో నుంచి వచ్చి ఆ చేప తోకను పట్టుకుంది.దీంతో ఒక పాము తల భాగాన్ని పట్టుకోగా, మరో పాము తోక భాగాన్ని పట్టుకుంది.

ఇక రెండు పాములు ఆ చేపను వదిలి పెట్టడం ఇష్టం లేక అలాగే కదలకుండా ఉండిపోయాయి.ఏకంగా 30 నిమిషాల పాటు అవి ఆ చేపను వదలకుండా అట్లే గాలిలో పట్టుకొని ఉన్నాయి.

ఇకపోతే ఈ సందర్భాన్ని పర్యావరణ రక్షకుడు శ్యాంప్రసాద్ వీడియో రూపంలో చిత్రీకరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోని ఆయన తాజాగా విడుదల చేశారు.

ఆయన వీడియో తీసిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని పూర్తిగా వివరిస్తూ… ఒక 30 నిమిషాల తర్వాత ఎటు కదలని రెండు పాములు చివరకు అసహనానికి గురై చివరికి కింద ఉన్న పాము వదిలి వెళ్ళిపోయిందనీ ఆ తర్వాత పైన ఉన్న పాము కూడా ఆ చేపలు పైకి లాక్కోలేక దాన్ని అక్కడే నీళ్లలోకి వదిలేసిందని తెలియజేశాడు.దీంతో ఏముంది… ఇక ఆ చేప బతికిపోయాను రా బాబు అని అనుకుంటూ నీటిలో తుర్రుమంది.

ఇకపోతే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఎక్కడ, ఏ మూలన జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.