ఈ మధ్య ఏ చిన్న సమస్య ఎదురైనా అది చిన్నదైనా పెద్దదైన కూడా డైరెక్ట్ గా ప్రధాని మోడీకి కానీ ముఖ్యమంత్రులకు కానీ లేఖలు రాస్తున్నారు.ఈ లేఖల్లో కొంత మంది తమ సమస్యలను రాస్తుంటే.
మరి కొంత మంది మాత్రా ఫన్నీ సమస్యలను రాస్తున్నారు.ఇలా ఫన్నీ సమస్యలను రాసినప్పుడు అవి కాస్త వైరల్ అవుతున్నాయి.
తాజాగా చిన్నారి అక్కాతమ్ముడు ఇద్దరు కలిసి మోడీకి, సీఎం కు లేఖ రాసారు.
ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ అక్కా తమ్ముడు ఇద్దరు ఆ లేఖలో ఏం రాసారో తెలిస్తే మీరు తప్పకుండ షాక్ అవుతారు.అంత షాక్ అయ్యే విషంగా ఎం రాశారబ్బా అని ఆలోచిస్తున్నారా.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.అస్సాం రాష్ట్రానికి చెందిన అక్కాతమ్ముళ్లు ఇద్దరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు లేఖలు రాసారు.
అయితే ఆ లేఖలో ఆ అక్కాతమ్ముళ్లు ఏం రాసారంటే.తమకు వయోజన దంతాలు సరిగ్గా పెరగడం లేదని అందులో రాయడంతో ఇప్పుడు ఆ లేఖ కాస్త వైరల్ అయ్యింది.
ఆ అక్కాతమ్ముడి వయసు.అక్కకు 6 సంవత్సరాలు కాగా తన తమ్ముడికి 5 సంవత్సరాలు.తమకు వయోజన దంతాలు చాలా ఆలస్యంగా పెరుగుతున్నాయని అందుకే తమకు ఇష్టమైన పదార్ధాలను తినలేక పోతున్నామని తెలిపారు.
ఈ లేఖలు ఆ పిల్లల మామయ్య సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఆ లేఖ ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
పాల దంతాలు ఊదిన తర్వాత ఈ పిల్లలకు మళ్ళీ శాశ్వత దంతాలు రావడానికి చాలా సమయం పట్టడం వల్ల ఈ సమస్యను సీఎం, పీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆ అక్కాతమ్ముళ్ళు నిర్ణయించుకున్నారట.అందుకే ఆ లేఖలో తమ పళ్ళు తొందరగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు.
ఈ లేఖ చదివిన నెటిజెన్స్ క్యూట్ అంటూ వారి అమాయకత్వానికి ముచ్చట పడుతున్నారు.