చంద్రబాబుపై కొనసాగుతున్న కేసుల పరంపర.. మరో రెండు నమోదు.. !

అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయడం, ప్రతిపక్షంలోకి మారాక ఎదుటి వారు చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం రాజకీయ నేతలకు అలవాటుగా మారిన పని.ఇక నోటి దురుసు ఉన్న వారే రాజకీయాల్లో నెట్టుకొస్తారనే నానుడి ఉంది.

 Two More Cases Against Chandra Babu Naidu In Guntur And Narasarao Pet, Ap, Tdp,-TeluguStop.com

అయితే ఇలాంటి నోటి దురద వల్ల చిక్కుల్లో చిక్కుకోవడం కూడా జరుగుతుంది.

ఇకపోతే కరోనా సమయంలో ప్రజలకు చేయవలసిన సహాయం మరచి పనికిమాలిన రాజకీయాలు చేస్తున్న వారు ముఖ్యంగా మన రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉన్నారట.

ఇప్పుడిప్పుడే ప్రజలకు ఈ విషయం అర్ధం అవుతుందని ముచ్చటించుకుంటున్నారట.ఇదిలా ఉండగా కరోనాపై లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇదివరకే కర్నూలులో చంద్రబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

అయితే తాజాగా న్యాయవాదులు చేసిన ఫిర్యాదుపై గుంటూరు, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై మరో రెండు కేసులు నమోదయ్యాయని సమాచారం.అసలే కరోనా ప్రజలతో చదరంగం ఆడుతుంటే ఈ రాజకీయనేతలు పనిగట్టుకుని విమర్శించుకోవడం ఏంటని ఏపీ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube