కాశ్మీర్ లో ఎంకౌంటర్...ఇద్దరు ఉగ్రవాదులు మృతి

శ్రీనగర్ లో ఈ రోజు ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.కాశ్మీర్ లోని సోఫియాన్ జిల్లా లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

 Two Millitants Killed In Encounter-TeluguStop.com

అయితే ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు తెలుస్తుంది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… కాశ్మీర్ లోని సోఫియాన్ జిల్లా లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడం తో రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం తో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు.దీనితో ఈ ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ముజాయిద్దీన్ కమాండర్లు ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది.

భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వారిని తారిక్ మౌల్వీ అలియాస్ ముఫ్తి వకాస్,లతీఫ్ టైగర్లు గా అధికారులు గుర్తించారు.

అయితే ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ కూడా గాయపడినట్లు సమాచారం.

శుక్రవారం ఉదయం నుంచే ఈ ఆపరేషన్ జరుగుతుండగా, ఇంకా ఆ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.ప్రస్తుతం సోఫియాన్ జిల్లా లోని ఇమామ్ సాహిబ్ దగ్గర ఉన్న అదక్కారా ఏరియా లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

గత ఏడాది హతమైన బుర్హాన్ వాని బృందానికి చెందిన మిలిటెంట్ల లో లతీఫ్ చివరివాడు గా అధికారులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube