చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఒకప్పుడు ఎంతో గోప్యంగా ఉండే శృంగారం, నీలి చిత్రాలు ఇప్పుడు ఓపెన్ గా దొరికేస్తున్నాయి.ఆన్ లైన్ లో వేల సంఖ్యలో నీలి చిత్రాలకి సంబందించిన వెబ్ సైట్స్ ఉన్నాయి.
అలాగే ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లు కూడా శ్రుతిమించిపోతున్నాయి.లైంగిక భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా కనిపిస్తున్న ఇలాంటి వీడియోల ప్రభావం యువతరం, ముఖ్యంగా టీనేజ్ మీద విపరీతంగా ఉంది.
వీటికి బానిసలుగా మారిన వారు లైంగిక నేరాలు చేస్తూ, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసి చంపేసెంత వరకు వెళ్తున్నారు.
ఎన్ని చేసిన చట్టాలు ఇలాంటి ఘోరాలని, ఈ ఘోరాలు చేసే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొంత మంది శ్రుతి మించి అసహజ లైంగిక దాడులకి కూడా పాల్పడుతున్నారు.మూగజీవాల మీద లైంగిక దాడి చేస్తూ సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు.
ఆ మధ్య విజయనగరం జిల్లాలో కొంత మంది కుర్రాళ్ళు మూగజీవాల మీద లైంగిక దాడి చేస్తూ పట్టుబడ్డారు.వారిని అరెస్ట్ చేశారు.తాజాగా అలాంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.అదే గ్రామంలో ఓ గ్రానేట్ క్వారీలో కూలీగా పని చేస్తున్న లలిత్ కుమార్, హరీష్ అనే ఇద్దరు వ్యక్తులు రాత్రి పశువులపై అత్యాచారం చేస్తుండగా గమనించిన ఓవ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.
దీనితో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.నిందితులు రాజస్థాన్ రాష్ట్రంలోని డైలాంట్ కు చెందిన వారుగా గుర్తించారు.