రైలు నుంచి జారిపడడం ఈమధ్య కాలం లో ఎక్కువైపోయింది .రైలు కంపార్ట్ మెంటులో ఖాళీగా ఉన్న అక్కడ కూర్చోకుండా డోర్ వద్ద కూర్చుని ప్రయాణాలు చేయడం ఎక్కువైపోయింది .
అక్కడే కునికి పాటులు పడడం వంటి చేష్టలు కారణంగా జారిపడడం ఎక్కువైయ్యింది .ఈరోజు నవీపేట మండలంలో రెండు వేర్వేరు సంఘటనల్లో రైలు నుండి జారిపడి సోమవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు.దర్యానిపూర్ రైల్వేగేట్ సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందగా, నాగేపూర్ రైల్వేగేట్ వద్ద మరొకరు రైలు నుండి జారిపడి దుర్మరణం చెందారు.మృతుల వయస్సు 40సంవత్సరాల వరకు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు.
శవ పంచనామా జరిపి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామని, ఎవరయ్యింది తెలియలేదని వారి శవాల వద్ద లభించే ఆధారాలు వారి చిరునామాలు తెలిపేలా లేవు అని చెప్పారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .