కర్ణాటక రాష్ట్రంలో ఒకే రోజు రెండు వింత ఘటనలు చోటు చేసుకున్నాయి.ఒక పెళ్లి మండపంలో వధువు మిస్ కాగా మరో పెళ్లి మండపంలోవరుడు మిస్ అయ్యాడు.
కానీ ఈ వధువుకు, ఆ వరుడికి ఎలాంటి సంబంధం లేకపోవడం గమనార్హం.కర్ణాటక రాష్ట్రంలో రెండు వేరు వేరు ప్రాంతాలలో ఒక చోట వధువు ఇంటి నుండి పారిపోగా మరోచోట వరుడు ఇంటి నుండి పారిపోయాడు.
కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంత్ పూర్, హసన్ ప్రాంతాలలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
పూర్తి వివరాలలోకి వెళితే హసన్ లో సంగీత రఘుకుమార్ గాఢంగా ప్రేమించుకున్నారు.
పెద్దల అంగీకారంతో వివాహానికి ఏర్పాట్లు కూడా జరిగాయి.ఆ ప్రాంతమంతటా పెళ్లి సందడి నెలకొంది.
మరికొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లికూతురు పెళ్లికొడుకు కుటుంబం తెచ్చిన చీర నచ్చలేదని గొడవకు దిగింది.పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబాల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో పెళ్లికొడుకు రఘుకుమార్ అదృశ్యమయ్యాడు.
మరో ఘటనలో యశ్వంతపూర్ లోని చామరాజనగర్ లో ఒక యువతికి అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయించారు.ఇంటికి పందిరి వేసి తోరణాలు కట్టి ఘనంగా ఏర్పాట్లు చేశారు.
పెళ్లి పీటల మీదకు రావాల్సిన వధువు మాత్రం పెళ్లి మండపం నుండి పరారైంది.ఆమె ప్రేమించినవ్యక్తితో కలిసి పరారైందని తెలియటంతో షాక్ అవ్వడం పెళ్లికొడుకు కుటుంబ సభ్యుల వంతయింది.
ఒకే రోజు ఒకే రాష్ట్రంలో రెండు వేరు వేరు ప్రాంతాలలో వధువు, వరుడు పెళ్లి మండపాల నుండి అదృశ్యం కావడం గమనార్హం.