మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కీసర అవుటర్ రింగ్ రోడ్డుపై అదుపుతప్పిన ఓ కారు డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న టాటా విస్టాను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా… మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతరం గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.