పాక్ లో మిస్ అయిన భారత దౌత్యవేత్తలు!

పొరుగుదేశం పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్‌కు చెందిన ఇద్దరు అధికారులు సోమవారం ఉదయం నుంచి ఆచూకీ లభించడం లేదు.దీనితో ఆందోళన నెలకొనింది.

 Two Indian, High Commission ,officials ,missing,  Pakistan-TeluguStop.com

అధికార వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం, దౌత్య వేత్తలు అయిన ఇద్దరు అధికారులు ఇస్లామాబాద్‌లో కార్యాలయ పనుల గురించి బయలుదేరి వెళ్లగా, ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం లభించకపోవడం అనుమానాలకు తావిస్తుంది.వారిద్దరి మొబైల్‌ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడం తో అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు.

విషయమై పాకిస్థాన్ అధికారులను కూడా భారత్ సంప్రదించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు.ఇంకా వారి జాడ తెలియాల్సి ఉంది.

అయితే కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ లో తమ దౌత్యవేత్తలను వేధిస్తున్నారని భారత్ వేలెత్తి చూపిన విషయం తెలిసిందే.పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డిటెక్టివ్ ఒకరు… పాక్ లోని భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లువాలియా కారును వెంబడిస్తున్నట్లు ఇటీవల ఓ వీడియో కూడా బయటపడింది.

అంతేకాకుండా అదే సమయంలో, కొంతమంది అహ్లువాలియా ఇంటి వెలుపల కూడా కనిపించడం ఇప్పుడు ఇలా ఇద్దరు దౌత్యవేత్తలు మిస్ అవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది.

భారత రాయబార కార్యాలయాల అధికారులను వేధించిన ఫిర్యాదులపై ఇప్పటికే భారత్ పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నోటీసు కూడా ఇచ్చింది.

పాకిస్తాన్ తన దౌత్యవేత్తలకు తగిన భద్రత కల్పించాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది కూడా.అయితే సోమవారం ఇలా ఇద్దరు దౌత్యవేత్తల ఆచూకీ లభించకపోవడం తో వారు ఏమై ఉంటారో అన్న ఆందోళన అధికారుల్లో కలుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube