సెల్ఫీ పిచ్చితో నదిలోకి దిగిన ఇద్దరు యువతులు.. చివరికి?

ఈ కాలం యువతకు టిక్ టాక్ పిచ్చి తర్వాత ఉండేది సెల్ఫీ పిచ్చినే.ఏదైనా మంచి ప్రదేశం కనిపిస్తే దాన్ని ఆస్వాదించడం పక్కన సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటారు.

 Two Girls, Trapped In River, Selfie, Madhya Pradesh, Madhya Pradesh River ,-TeluguStop.com

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ఇద్దరి యువతులు సెల్ఫీ కోసం వెళ్లి పోలీసులకు చుక్కలు చూపించారు.ఇంకా ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.మ‌ధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని బేలాఖేడి గ్రామంలో గురువారం ఆరుగురు అమ్మాయిలు సరదాగా త‌మ గ్రామ స‌మీపంలోని పెంచ్ న‌ది వ‌ద్దకు వెళ్లారు.అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు.అంతేకాదు చుట్టూ ఉన్న ప్రదేశాలను ఫోటోలు తీశారు.

ఈ నేపథ్యంలోనే ఇద్దరు యువ‌తులు మరో అడుగు ముందుకేసి న‌దిలో ఉన్న ఓ రాయి వ‌ద్దకు వెళ్లి సెల్ఫీకి ఫోజిచ్చారు.

ఇంకా ఇంతలోనే నదికి వ‌ర‌ద పోటెత్తింది.

దీంతో వారిద్దరూ రాయిపైనే చిక్కుకుపోగా ఆ వరద అంతకంతకు పెరుగుతూ భయపెట్టింది.ఇది గమనించిన మిగితా నలుగురు అమ్మాయిలు స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘ‌ట‌నా స్థలికి చేరుకొని స‌హాయ‌ చ‌ర్యలు చేప‌ట్టారు.

స్థానిక గజ ఇతగాళ్ల సాయంతో రాళ్ల మధ్య తాళ్లు కట్టి చాలా కష్టపడి యువతులు ఇద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.యువతులిద్దరు వారిని కాపాడిన పోలీసులు, స్థానికులకు థాంక్స్ చెప్పారు.

కాగా ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube