ప్రేమ వివాహంతో ఒక్కటైన ఇద్దరు అమ్మాయిలు

కరోనా కారణంగా దాదాపు మార్చి చివరి నుండి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.ఊహించకుండా వచ్చిన బ్రేక్ ను వేస్ట్ చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని వారంతా జీవితంలో ముఖ్య ఘట్టమైన పెళ్లి చేసేసుకుని వాళ్ళ జీవిత భాగస్వాములతో క్వాలిటీ టైం ను గడుపుతున్నారు.

 Two Girls Married In Kanpur, Kanpur, Major,police Complaint-TeluguStop.com

తాజాగా యూపీలో ఓ జంట కరోనా టైంలో తమ ప్రేమను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకున్నారు.అందుకే పెద్దలు అంగీకరించకపోయినా వారిని కాదని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.

ఇందులో కొత్త ఏముంది అని మీరు అనుకోవచ్చు అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరూ అమ్మాయిలు.మరి అసలు వీరిద్దరి కథ ఎక్కడ మొదలైందో ఇప్పుడు చూద్దాం.

కాన్పూరుకు చెందిన ఏక్తా, అయోధ్యకు చెందిన వర్ష అనే యువతులిద్దరు బంధువులు.దీని కారణంగా ఒకరి ఇంటి నుండి మరొకరి ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవారు.ఈ టైంలో ఏక్తా,వర్షకు ఒకరితో ఒకరికి పరిచయం అయింది.ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు.

వీరిద్దరి వ్యవహారం శృతిమించుతుండడంతో ఇరువురి తల్లిదండ్రులు ఏక్తా,వర్షలను మందలించారు.
తల్లిదండ్రుల వ్యవహారం అర్థమైన వీరిరువురు ఆగష్టు 26న కాన్పూర్ లోని తపస్వీ మందిర్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.కానీ ఇరువురు మేజర్లు కావడంతో తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube