మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సాధించుకున్నాడు.ఈ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఈ క్రమంలోనే రీసెంట్గా గద్దలకొండ గణేష్ అనే సినిమాతో బాక్సాఫీస్ను అలరించిన ఈ హీరో ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
బాక్సర్ అనే సినిమాతో ప్రేక్షకుల మందుకు వస్తున్న వరుణ్, తన నెక్ట్స్ మూవీలను కూడా లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.
ఈ క్రమంలోనే వరుణ్ తేజ్తో కలిసి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ అదిరిపోయే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ కథను మరో డైరెక్టర్ కమ్ రైటర్ వక్కంతం వంశీ అందిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.
ఇక ఈ సినిమాతో మరోసారి సురేందర్ రెడ్డి తన సత్తాను బాక్సాఫీస్ వద్ద నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
మరి ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్తో వస్తుందా, ఇది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది.కాగ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన రీసెంట్ మూవీ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు వరుణ్ తేజ్తో కలిసి మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు సురేందర్ రెడ్డి రెడీ అవుతున్నాడు.