మొన్నటివరకు కరోనా సెకండ్ వేవ్ విజృంభించగా ఇప్పుడిప్పుడే పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది.ఇలాంటి టైం లో మళ్లీ కేరళలో కరోనా కేసులు పెరగడంతో అక్కడ ప్రభుత్వం రెండు రోజులు పూర్తి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది.
ఈ నెల 24, 25 శని, ఆదివారాలు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు.దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
వాటిలో ఎక్కువగా కేరళ నుండి పెద్ద సంఖ్యలో వస్తున్నాయి.అందుకే రెండు రోజుల లాక్ డౌన్ తో కరోనా కట్టడి చేయాలని చూస్తున్నారు.
కేరళ ప్రభుత్వం కరోనా టెస్ట్ చేసే విధానాన్ని కూడా పెంచాలని అనుకుంటున్నారు.
శుక్రవారం రోజు 3 లక్షల పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులకు కేరళ ప్రభుత్వం సూచించింది.ఈ క్రమంలో రెండు రోజుల లాక్ డౌన్ తో కొద్దిమేర కేసులను తగ్గించే అవకాశం ఉందని చెప్పొచ్చు.
టెస్టులను పెంచి కేసులను కూడా తగ్గించే ప్రయత్నంలో కేరళ ప్రభుత్వం ఉంది.దృష్టి పెట్టింది.
ఈ క్రమంలో వీకెండ్ లాక్ డౌన్ ను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.పరిస్థితి చేయి దాటకుండా ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది.