ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేయడానికి వచ్చి.... కుర్చీ కోసం కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

కుర్చీ కోసం కాంగ్రెస్ నేతలు ఒకరు నొకరు తోసుకున్నారు.సీటు కోసం కొట్టుకున్న నేతలను చూసాం కానీ కుర్చీ కోసం కొట్టుకున్న నేతలను మాత్రం ఇప్పుడు చూడొచ్చు.

 Two Congress Leaders Fighting For Chair-TeluguStop.com

కాంగ్రెస్ సీనియర్ వీ హెచ్ మరో నేత నగేష్ లు స్టేజ్ పై ఒకరినొకరు తోసుకున్న ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకీ వెళితే….

ఇటీవల తెలంగాణా ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాలపడ్డారు.

ఈ నేపథ్యంలో విపక్షాలు అనియి కూడా ఇందిరా పార్క్ లో ని ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు.అయితే ఈ సందర్భంగా దీక్షా శిబిరం లో వచ్చిన పని గురించి వదిలేసి కుర్చీ కోసం వీ హెచ్,నగేష్ లు ఒకరినొకరు తోసుకున్నారు.

వీ హెచ్ స్టేజ్ పై మాట్లాడుతున్న సందర్భంలో కుంతియా శిబిరం వైపు కు రావడం తో కుర్చీ ని కుంతియా కి వేసే ప్రయత్నం చేసాడు నగేష్.

దానితో వెంటనే అక్కడకి వచ్చిన వీ హెచ్ నగేష్ తో వాగ్వివాదానికి దిగడం తో ఈ క్రమంలో తొలుత వీ హెచ్ నగేష్ ను కిందట తోశారు.

దానితో ఆవేశం ఆపుకోలేక నగేష్ కూడా కింద నుంచి లేచి వీ హెచ్ ను తోయడం తో ఆయన కూడా కింద పడిపోయారు.దీనితో అక్కడే ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కనియె వాళ్ళు వినలేదు.

అధికారంలో ఉన్న పార్టీ ని ఎండగడుతూ ఎదో స్పీచ్ ఇద్దాం అని వచ్చిన ఈ నేతలు కుర్చీ ల కోసం కొట్టుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube