పురుగుల మందు తాగి ఇద్దరి ఆత్మహత్య !

నల్గొండలో విషాదం చోటు చేసుకుంది.పురుగుల మందు తాగి ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 Nalgonda, Two Commit Suicide, Drinking Insecticide-TeluguStop.com

తమ బంధాన్ని ఎవరూ ఒప్పుకోకపోవడంతో మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే వీరిది అక్రమ సంబంధం కావడంతో ఎవరూ ఒప్పుకోకపోవచ్చని, అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.చనిపోయిన వ్యక్తికి ఇదివరకే పెళ్లైంది.

అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన రాచకొండ శ్రీనుకు ఇదివరకే వివాహం జరిగింది.

వీరి మధ్య గొడవలు ఎక్కువ అవడంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.ఈ క్రమంలో గ్రామానికి చెందిన నాగేశ్వరి ప్రేమతో పడ్డాడు.

గుట్టు చప్పుడు కాకుండా వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారం కొనసాగించారు.మంగళవారం రాత్రి గ్రామ శివారులోని పొలాల్లో వీరిద్దరూ శవమై తేలారు.

పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఎంటో తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube