టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రెండు కేసులు..!

తెలంగాణా ప్రదేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన వ్షయం తెలిసిందే.బుధవారం పార్టీ ఆఫీస్ లో భారీ సభ ఏర్పాటు చేసి బాధ్యతలు స్వీకరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

 Two Cases Booked On Tpcc Chief Revanth Reddy , Booked, Cheif, Pcc Cheif Revanth-TeluguStop.com

అయితే అధ్యక్ష పదవి ఇలా ఎక్కారో లేదో అలా ఆయన మీద రెండు కేసులు నమోదు చేశారు.అనుమతులు లేకుండా ర్యాలీ చేసినందుకు రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

జూబ్లీ హిల్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేసు నమోదు చేశారు.కరోనా నిబంధనల ప్రకారం అనుమతి లేనిదే ర్యాలీలు నిర్వహించకూడదు కాని రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు.

దీనిపై కేసు నమోదు చేశారు.

బేగం బజార్ లో రేవంత్ రెడ్డిపై మరో కేసు పెట్టారు.

రేవంత్ రెడ్డి పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత నాంపల్లి దర్గా లో ప్రార్ధనలు చేశారు.ఆ తర్వాత భారీ ర్యాలీగా గాంధీ భవన్ చేరుకున్నారు.

అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టే టైం లో చట్ట ఉల్లంఘనలపై పోలీసులు ఈ కేసులు పెట్టినట్టు తెలుస్తుంది.కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కావాలనే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడుతున్నారు.

ఈ కేసులపై టీపీసీసీ కొత్త చీఫ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube