సాధారణంగా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు విడిపోయేటప్పుడు ఆస్తి పంపకాలలో భూమిని సమానంగా పంచడం మనం చూస్తూ ఉంటాం.కానీ మన దేశంలోని హిమాచల ప్రదేశ్ శివారు ప్రాంతాల్లో మాత్రం ఇంట్లో జీవనాధారం అయినటువంటి భూమిని విడగొట్టడం ఇష్టం లేక ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక యువతిని పెళ్లి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్ శివారు ప్రాంతంలో కొంత మంది గిరిజన ప్రాంత వాసులు నివసిస్తుంటారు.అయితే వీరిలో ఒక కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు యువకులు అదే ప్రాంతానికి చెందినటువంటి ఒక యువతిని పెళ్లి చేసుకున్నారు.
దీంతో అక్కడికి వెళ్లి నటువంటి ఓ పర్యాటక కేంద్రం సభ్యులు ఒకే యువతిని ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఏంటని ప్రశ్నించగా వారు చెప్పిన సమాధానాలను విని విస్తుపోయారు.సాధారణంగా కుటుంబంలోని అన్నదమ్ములు వేరువేరు పెళ్ళిళ్లు చేసుకుంటే వారికి ఆస్తి పంపకాలలో మనస్పర్ధలు మరియు కుటుంబంలో విభేదాలు వంటివి వస్తాయని అటు వంటి సమస్యలను అధిగమించేందుకు ఇలా అందరూ అన్నదమ్ములు కలిసి ఒకే యువతిని పెళ్లి చేసుకుంటారని తెలిపారు.
అంతేగాక పలు చోట్ల దాదాపుగా నలుగురు, ఐదుగురు అన్నదమ్ములు కలిసి ఒకే యువతిని పెళ్లి చేసుంటారని అక్కడ నివసిస్తున్న ప్రజలు చెబుతున్నారు.
అయితే ఈ విషయంపై స్పందించి నటు వంటి పలువురు మాత్రం వారికి మారుతున్న జీవన శైలి పై అవగాహన లేదని అంతేగాక పూర్వకాలంలోని ఉన్నటువంటి మూఢనమ్మకాలను ఇప్పటికీ నమ్ముతున్నారని అందువలనే ఇలాంటి పోకడలను ఆచరిస్తున్నారని అంటున్నారు.
తాజా వార్తలు