ఈ మధ్యకాలంలో అమ్మాయిలు మోసం చేసే అబ్బాయిల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.దీంతో చాలా మంది అబ్బాయిలు ఆత్మహత్య చేసుకోవడం, లేదంటే ఆమె మీద దాడులు చేయడం చేస్తున్నారు.
ఆయితే తాజాగా ఓ సంఘటన కాస్తా విచిత్రంగా జరిగింది.ఒక అమ్మాయి కోసం ఇద్దరు కుర్రాళ్ళు నడి రోడ్డు మీద కొట్టుకున్నారు.
అందరూ చూస్తుండగానే గుడ్డలు ఉడేలా పొట్టు పొట్టు కొట్టుకున్న సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హలసూరు గేట్ సమీపంలోని ధర్మరాయ దేవాలయం వద్ద ఈ ఘటన జరిగింది.
ఇక వివరాల్లోకి వెళితే హలసూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు కుర్రాళ్లు ఓకే అమ్మాయిని గాఢంగా ఇష్టపడ్డారు.అయితే ఆ అమ్మాయి ఇద్దరితో కూడా స్నేహంగా ఉండటంతో వారు ఆమె తని ప్రేమిస్తుంది అంటే తనని ప్రేమిస్తుంది అని గత కొంత కాలంలో గొడవ పాడుతున్నారు.
తాజాగా వీరిద్దరి మధ్య అమ్మాయి ప్రేమ వ్యవహారం తారస్థాయికి చేరుకోవడంతో రోడ్డు మీద బట్టలు చిరిగేలా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు.ఈ ఇద్దరి మధ్య గొడవని చూసిన స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసారు.