బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో వరుస కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.అతని మార్కెట్ మించి భారీ బడ్జెట్ తో కెరియర్ ఆరంభం నుంచి సినిమాలు తీస్తూ వచ్చాడు.
నిర్మాతలు కూడా బెల్లంకొండ శ్రీనివాస్ మీద భారీగా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యేవారు.కొడుకుని కమర్షియల్ స్టార్ హీరోని చేయాలనే కసితో ఉన్న నిర్మాత బెల్లంకొండ సురేష్ వెనకుండి అంతా నడిపిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ కుర్ర హీరో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు.అతని సినిమాలకి తెలుగులో కంటే హిందీ డబ్బింగ్ లో ఎక్కువ మంది ఆదరణ ఉంది.
హిందీలో ఒక వర్గం ప్రేక్షకులు బెల్లంకొండ సినిమాలని తెగ ఇష్టపడతారు.
ఈ నేపధ్యం బాలీవుడ్ లోకి ఓ పవర్ ఫుల్ మాస్ సబ్జెక్ట్ తో శ్రీనివాస్ అడుగుపెడుతున్నారు. రాజమౌళి ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు.ఈ సినిమా ద్వారా అక్కడ తన ఎంట్రీని ఘనంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇక దర్శకుడుగా సాహో సుజిత్ ని కన్ఫర్మ్ చేశాడు.ఇక హీరోయిన్లు విషయంలో బెల్లంకొండ శ్రీనివాస్ భారీతనం కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
వీలైనంత వరకు అందరూ బాలీవుడ్ తారాగణం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీస్ సారా అలీఖాన్, అనన్యా పాండేని హీరోయిన్లుగా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.
దీనికి సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానున్నట్లు సమాచారం.మరి బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న బెల్లంకొండకి అక్కడ ఘనస్వాగతం లభిస్తుందా లేదా అనేది చూడాలి.