ఒక దేశానికి సంబంధించిన సార్వభౌమాదికరానికి సంబంధించిన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.కొన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్ లు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన తీరు మనం చూస్తూనే ఉన్నాం.
ఫ్రీ బేసిక్స్ విషయం లో భారత దేశానికి ఫ్రీ గా ఇంటర్నెట్ ఇస్తాం అంటూ కబుర్లు చెప్పిన ఫేస్ బుక్ కి మనవాళ్ళు సరైన సమాధానం చెప్పారు.తాజాగా సోషల్ నెట్వర్కింగ్ రారాజు ట్విట్టర్ కూడా నిర్లక్ష ధోరణి తో వ్యవహరిస్తోంది.
దీంతో దానికి కూడా భారతీయులు షాకివ్వాల్సిన సమయం ఆసన్నమైంది.భారతదేశానికి చెందిన జమ్మూ.
కాశ్మీర్ కు సంబంధించి పాకిస్థాన్.చైనాలకు చెందిన ప్రాంతాలుగా చూపిస్తూ ట్విట్టర్ పెద్ద తప్పు చేసింది.
దీన్ని తప్పు అనే కన్నా నిర్లక్ష్యం అని చెప్పటం సబబుగా ఉంటుంది.ట్విట్టర్ లోని లొకేషన్ సర్వీస్ లో జమ్మూ అని కొట్టిన వెంటనే.
జమ్మూ.పాకిస్థాన్ అన్న ఫలితం.
అదే సమయంలో జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నది పీఫుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పేర్కొనటం గమనార్హం.ట్విట్టర్ లాంటి సంస్థలు దేశ సరిహద్దుల్ని నిర్లక్ష్యంతో మర్చిపోతే.
దానికి గాంధీగిరితో దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.మరింత ఆలస్యం ఎందుకు.
ట్విట్టర్ వైఖరిపై గాంధీగిరి షురూ చేస్తే సరి.