సోషల్ మీడియా దిగ్గజం కంపెనీల్లో ఒకటిగా పేరుగాంచిన మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ సరికొత్త ఫీచర్ ను తీసుకువస్తున్నట్లు తెలిపింది.ఇందులో భాగంగా ఆంగ్ల భాషలో ట్విట్టర్ వినియోగిస్తున్న లాభాపేక్ష లేని, అలాగే పాత్రికేయులతో పాటు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న మరికొందరు కోసం ట్విట్టర్ తాజాగా అందుబాటులోకి తీసుకు చేసింది.
ఈ ఫీచర్ కోసం ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్లు సులభంగా వేరే వారికి నగదు పంపిణీ చేసే విధంగా రూపొందించబోతున్నట్లు తెలియజేసింది.
ఇందులో భాగంగానే ఒక సెలబ్రిటీ లేదా ఎవరైనా వారి ఫాలోయర్ ఎక్కువ డబ్బులు ఖాతా కు పంపించాల్సి వస్తే.
ఈ కొత్త ఫీచర్ ద్వారా నేరుగా పంపించవచ్చు అని తెలియజేసింది.కాకపోతే దీనిని ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో యూజర్లు ముందుకు తీసుకొచ్చేందుకు ట్విట్టర్ కృషిచేస్తున్నట్లు తెలియజేసింది.
ఇప్పటికే ఈ టిప్ జార్ అనే టెక్నాలజీ ద్వారా బ్యాండ్ క్యాంప్, క్యాష్ యాప్, పేపాల్, వెన్మో, పట్రెయాన్ లాంటి నగదు బదిలీల్లో ఉపయోగిస్తున్నట్లు తెలియజేశారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ సోషల్ మీడియా ద్వారా తన సందేశాన్ని తెలుపుతూ.
“ఇకపై ఎన్నో గొంతులకు మీరు మద్దతు ఇవ్వచ్చు.టిప్ జార్ తో వారికి నగదును పంపించవచ్చు.ట్విట్టర్ ప్రొఫైల్ లోని టిక్ క్లిక్ చేసి ఆండ్రాయిడ్, ios లలో పరీక్షించిన తర్వాత నగదు బదిలీ చేసుకోవచ్చు” .ఈ ఫీచర్ ను ఆన్ ఆఫ్ చేసుకుని సౌకర్యాన్ని కూడా ట్విట్టర్ అందించబడుతుంది.వీటితో పాటు ట్విట్టర్ ఆడియో చాట్ యాప్ ద్వారా కూడా ఆండ్రాయిడ్ యూజర్లు వారి నగదు బదిలీని చేయవచ్చు.ఈ ఆప్షన్ కోసం మీ ట్విట్టర్ ప్రొఫైల్ పేజీలోని ఫాలో బటన్ పక్కన టిప్ జార్ ఐకాన్ యాడ్ కనబడుతుంది.
అక్కడ నుంచి ఈ ఆప్షన్ ను యూజర్లు వినియోగించుకోవచ్చు.