బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల అసలు కారణాలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదు.
సుశాంత్ మరణించి ఏడాదిన్నర కాగా సుశాంత్ పోస్టుమార్టంకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక విషయం అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేసేలా ఉండటం గమనార్హం.
సాధారణంగా సినిమా రంగంలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే మాత్రమే నటులుగా సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టీవీ రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.హీరోగా వరుస విజయాలను అందుకుంటున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది ఆఫర్లు రాకుండా చేశారని కొన్ని సినిమాలలో సుశాంత్ ఎంపికైన తర్వాత అతన్ని తొలగించారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
కూపర్ ఆస్పత్రి వైద్యులు సుశాంత్ మృతి విషయంలో ఇచ్చిన రిపోర్టుల విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అశీష్ రాయ్ అనే అడ్వకేట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోస్టుమార్టం విషయంలో వైద్యపరమైన లోపాలు, నిర్లక్ష్యం కనిపిస్తున్నాయని కేసు నమోదు చేయడం సంచలనమైంది.అశీష్ రాయ్ ముంబై పోలీసుల పనితీరు విషయంలో కూడా సందేహాలను వ్యక్తం చేయడం గమనార్హం.
మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవితం ఆధారంగా బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి.ఈ బయోపిక్ లను ఆపాలని సుశాంత్ సింగ్ తండ్రి ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి విషయంలో వాస్తవాలు ఎప్పటికి వెలుగులోకి వస్తాయో చూడాలి.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు మాత్రం సుశాంత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.సుశాంత్ ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని వాళ్లు కామెంట్ చేస్తున్నారు.