ప్రేమ పెళ్లి చేసుకున్న అనురాధ పరువు హత్య కేసులో ట్విస్ట్.! బయటకొచ్చిన సెల్ఫీ వీడియో.! చివరగా తల్లితో.?

నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ మండలం మల్లాపూర్‌ లో తీవ్ర కలకలం రేపిన కుమార్తె పరువు హత్య కేసులో పోలీసులు నమ్మలేని నిజాలను మీడియా ముందు వెల్లడించారు.కూతురి ప్రాణం కంటే తమకు పరువే ముఖ్యమనుకున్న కుటుంబ సభ్యులు, తమ చేతులతో తామే అనురాధను చంపేసినట్టు ఒప్పుకున్నారు.

 Twist In Pindi Anuradha Murder Case-TeluguStop.com

తల్లి చంపేయమనడం ఆలస్యం.ఆ తండ్రి గొంతు నులిమేశాడు.

అన్నయ్య ఆనవాళ్లు దొరక్కుండా శవాన్ని బూడిడ చేసేశాడు.హత్య జరిగిన రోజు ఏం జరిగిందో నిందితులు చెప్తున్న తీరు చూసి.

పోలీసులే షాక్ అయ్యారు.

చనిపోయే ముందు తన కూతురిని తల్లితో మాట్లాడించినట్టు సత్తెన్న చెప్పారు.

కులంలో పరువు పోయిందనే ఉద్దేశ్యంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని సత్తెన్న అతని కొడుకు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తేల్చి చెప్పారు.నాలుగేళ్లుగా ప్రేమించుకొన్న అనురాధ, లక్ష్మీరాజ్యం(లక్ష్మణ్)లు ఈ నెల 3వ తేదీన వివాహం చేసుకొన్నారు.

పెళ్లి చేసుకొన్న తర్వాత డిసెంబర్ 23వ తేదీనే స్వగ్రామానికి తిరిగి వచ్చారు.గ్రామానికి భర్తతో కలిసి తన కూతురు వచ్చిన విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు అనురాధను భర్త ఇంటి నుండి తీసుకెళ్లి చంపేశారు.

కూతురిని చంపేసిన ఆనవాళ్లు కూడ దొరకుండా బూడిదను పంటపొలంలోని నీళ్లలో కలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.తన పేరు అనురాధ అని, తమది కలమడుగు అనే గ్రామమని పేర్కొంది.తాను లక్ష్మణ్ అనే వ్యక్తిని ప్రేమించానని, ఆరు నెలల క్రితం ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశానని పేర్కొంది.

వారు అంగీకరించకపోగా, తనతో అతడిపై తప్పుడు కేసు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేసింది.అతడిని తాను మర్చిపోలేకపోతున్నానని, అతడితోనే తన జీవితమని పేర్కొంది.ఇంట్లోంచి వెళ్లిపోయి లక్ష్మణ్‌ను పెళ్లి చేసుకుని అతడితో ఉండాలనేదే తన కోరిక అని పేర్కొంది.ఈ క్రమంలో తాను అతడితో వెళ్లిపోయిన తర్వాత తమకు హాని జరిగితే దానికి తన తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్‌దే పూర్తి బాధ్యత అవుతుందని పేర్కొంది.

అనురాధ తండ్రి సత్యయ్య, తల్లి లక్ష్మి, అన్న మహేశ్‌తో మరికొందరు లక్ష్మణ్ ఇంటిపై దాడి చేసి అమ్మాయిని లాక్కెళ్లారు.కులం కాని వాడిని ప్రేమించిందంటూ విపరీతంగా కొట్టారు.లక్ష్మణ్‌ను మర్చిపోవాలని వార్నింగ్ ఇచ్చారు.ఆమె కుదరని చెప్పడంతో పిచ్చి కోపంలో మరోసారి దాడి చేశారు.కళ్లుతిరగి పడిపోయిన అనురాధను.బైక్‌పై కూర్చోబెట్టుకుని నిర్మల్‌ జిల్లా మల్లాపూర్‌ చేరుకున్నారు.

అక్కడ మరోసారి బెదిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు.తల్లి లక్ష్మితో ఫోన్‌లో మాట్లాడించారు.

నచ్చచెప్పించారు.ఐనా వినకుండా తాను భర్తతోనే ఉంటానని అనురాధ తేల్చి చెప్పంతో తల్లి కూడా కూతురిని చంపేయాలన్న మాటకే మద్దతిచ్చింది.

భర్తకు అదే విషయం చెప్పింది.ఆ వెంటనే సత్తయ్య గొంతు నులిమి అనురాధను చంపేశాడు.

తర్వాత అన్న మహేష్ కట్టెలు తెచ్చి శవాన్ని కాల్చేశాడు.తెల్లవారుజాము వరకూ అక్కడే ఉండి.

శవం పూర్తిగా కాలిపోయాక ఆనవాళ్లు లేకుండా బూడిడ సహా అంతా ఎత్తి పక్కన ఉన్న కాల్వలో పడశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube