చక్రి మరణంలో ట్విస్ట్‌?

సంగీత దర్శకుడు చక్రి అకాల మరణం తర్వాత ఆయన కుటుంబంలోని విభేదాలు వెళ్లడైన విషయం తెల్సిందే.చక్రి మరణించిన కొన్ని గంటల్లోనే ఆయన భార్య శ్రావణి తనను అత్తింటి వారు వేదిస్తున్నారంటూ మానవ హక్కుల కమీషన్‌కు వెళ్లిన విషయం తెల్సిందే.

 Twist In Music Director Chakri Death-TeluguStop.com

అయితే ఆ తర్వాత సినీ పెద్దలు శ్రావణికి మరియు ఆమె అత్తింటి వారికి మద్య సమన్వయం జరిపి వివాదం సర్దుమనిగేలా చేశారు.ఆ తర్వాత చక్రి భార్య మాట్లాడుతూ తమ మద్య ఎలాంటి విభేదాలు లేవంటూ ప్రకటించింది.

తాజాగా మరోసారి చక్రి భార్య శ్రావణి సంచలన వ్యాఖ్యలు చేసింది.తన భర్య మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయని, ఆయన మరణించడానికి ముందు రోజు మా అత్తారింటి వద్ద భోజనం చేశాడనే ట్విస్ట్‌ ఇచ్చింది.

ఆ రోజు రాత్రి ఆయన చనిపోవడం, ఆ వెంటనే నగలు మరియు విలువైన వస్త్రాలు, కాగితాలు వారు తీసుకోవడం అంతా తనకు అనుమానాలను కలుగ జేస్తుందంటూ తన అనుమానాన్ని బయట పెట్టింది.దాంతో పోలీసులు చక్రి కుటుంబ సభ్యులను విచారించాలని భావిస్తున్నారు.

ఈ విషయం పోలీసులు కూడా జుట్టు పీక్కుంటున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ముగిసిందనుకున్న చక్రి కుటుంబ వివాదం మళ్లీ రాజుకుంది.

ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube