గత కొద్ది రోజులుగా బెజవాడ రాజకీయం ఆసక్తిగా మారింది.ప్రత్యేకంగా సాక్షాత్తూ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే రోడ్లెక్కి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
దీనిపై అధినేత చంద్రబాబు సైతం వెంటనే నానిను పిలిపించి క్లాస్ పీకి ఈ సమస్యను చక్కదిద్దే భాద్యతని కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగించినట్లు తెలుస్తుంది.అయితే సుజనా సైతం విజయవాడ వచ్చి ఒక హోటెల్ లో అటు నాని, ఇటు ఉమ ఇద్దరిని పిలిపించి మాట్లాడి సర్ది చెప్పినట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ వాళ్లు రోడ్డెక్కారా అని వారిని నిలదీశారని తెలుస్తోంది.ఇకనైనా మనం సంయమనంతో వ్యవహరించాలని, అభివృద్ధి కోసం పోటీ పడాలని వారికి సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ భేటీ తరువాత మాట్లాడిన సృజనా వారిద్దరి మధ్య గొడవులు ఏమీ లేవు అని, కేవలం అభివృద్ది విషయంలోనే వారు పోటీ పడటంతో ఇలా జరిగింది అని, దానికి కారణ అధికారుల బదిలీ అని, దాన్ని మరో వారం రోజుల్లో పూర్తి చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాం అంటూ తెలిపారు.ఏది ఏమైనా సంధి కుదర్చడంలో సుజనాను మెచ్చుకోవాలి.