అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగు హిందీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.
ఈమె బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత ఈమె 2001 లో అక్షయ్ కుమార్ ను వివాహం చేసుకుంది.
అనంతరం ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.ప్రస్తుతం ఈమె కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, తన పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతోంది.
అయితే ట్వింకిల్ ఖన్నా కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా నటించింది.టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన శీను సినిమాలో నటించింది.
అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది.అందులో ఒక పుస్తకం ఫోటోను పంచుకున్నా ట్వింకిల్ ఖన్నా ఈ పుస్తకం పేరు ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా… ప్రముఖ సినీ విమర్శకులు సంపాదకురాలు భావన సోమయ్య ఈ పుస్తకాన్ని రాసింది.
సినిమా జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాల తో పాటు అమ్మ డింపుల్ కపాడియాకు మధ్య జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారని తెలిపింది.ఒకసారి విమానాశ్రయంలో అనుకోకుండా తన తల్లీకూతుళ్లను కలిశానని ఆ సమయంలో ట్వింకిల్ తన భుజాల మీద లగేజిని మోస్తుండగా డింపుల్ మాత్రం కుర్చీలో కూర్చుని ఉందనే విషయాన్ని ప్రస్తావించింది.
అయితే ఎందుకు బరువు మోస్తున్నావని ట్వింకిల్ అడగగా.అమ్మకు చెకింగ్ ప్రాసెస్ అంటే ఇష్టముండదని, ఫ్లైట్ ల్యాండింగ్ తర్వాత ఎదురుచూడటం తనకు అస్సలు నచ్చదు అని క్లారిటీ ఇచ్చింది.అందుకే అమ్మకు కూలీగా మారాల్సి వచ్చిందనే ట్వింకిల్ వివరించినట్లు తన పుస్తకంలో పేర్కొంది.