బాలీవుడ్ లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి ఎంత మంచి ఇమేజ్ లో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే అక్షయ్ కుమార్ తో పాటు అతడి భార్య ట్వింకిల్ ఖన్నాకు కూడా సినీ పరిశ్రమలో మంచి పేరు ఉంది.
అయితే తాజాగా ట్వింకిల్ కన్నా చేసినటువంటి ఓ పని ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో చర్చనీయాంశం గా మారింది.
అయితే తాజాగా ట్వింకిల్ కన్నా షూటింగ్ నిమిత్తమై బయటకు వచ్చింది.
షూటింగ్ పూర్తయిన తర్వాత మీడియా ముందుకు వస్తు తన ముఖా నికి పేపర్ అడ్డు పెట్టి దర్శనం ఇచ్చింది.దీంతో మీడియా వర్గాలు ట్వింకిల్ కన్నా కి ఏమైంది అంటూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
దీంతో ట్వింకిల్ కన్నా ఈ విషయం గురించి స్పందిస్తూ తొందర్లోనే తాను ఇలా ఎందుకు చేశానో వెల్లడిస్తానని వీడియో ద్వారా తెలిపింది.దీంతో ప్రస్తుతం ఈ విషయం గురించి బాలీవుడ్లో బాగానే చర్చించుకుంటున్నారు.
అయితే కొందరు నెటిజన్లు ట్వింకిల్ కన్నాకి కరోనా వైరస్ ఏమైనా సోకిందేమో అందుకే ఇలా ముఖానికి పేపర్ ని అడ్డుపెట్టుకొని వెళుతుందంటూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.మరి ఇంతకీ విషయం ఏంటో తెలియాలంటే ట్వింకిల్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ట్వింకిల్ కన్నాబాలీవుడ్లో నటిగానే కాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది.అంతేగాక పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.అయితే అక్షయ్ కుమార్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించడం మానేసి నిర్మాతగా మారింది.ప్రస్తుతం ట్వింకిల్ కన్నా ఒక పక్కన తన కుటుంబ బాధ్యతలను చక్క దిద్దుతూ మరోపక్క సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.