సినిమాల్లో కవల సోదరులు ఒకరి స్థానంలో మరొకరు వెళ్లడం, ఒకరిని మరొకరు కాపాడుకోవడం కోసం ఇతరులను మోసం చేయడం జరుగుతూ ఉంటుంది.ఇక హీరోలు కవలలు అయితే రౌడీలకు చుక్కలు చూపించేందుకు ఒకరి స్థానంలో మరొకరు వెళ్లడంను చాలా సినిమాల్లో మనం ఇప్పటి వరకు చూశాం.
అయితే ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతాయని అనుకున్నాం.కాని మొదటి సారి రియల్గా కూడా ఈ సంఘటన జరిగి అందరిని ఆశ్చర్య పరిచింది.
దక్షిణ టర్కీకి చెందిన హుసేయిన్ అనే వ్యక్తి కేసు విషయంలో జైల్లో పడ్డాడు.జైల్లో పడ్డ హుసేయిన్కు కవల సోదరుడు ఉన్నాడు.అతడి పేరు మూరత్.హుసేయిన్ జైల్లో పడ్డ కొన్ని రోజుల తర్వాత మూరత్ తన సోదరుడిని జైల్లో కలిసేందుకు వెళ్లాడు.అక్కడ దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.20 నిమిషాల తర్వాత మూరత్ బయటకు వెళ్లి పోయాడు.అయితే జైలు అధికారులకు కొద్ది సేపటి తర్వాత తెలిసిన విషయం ఏంటీ అంటే వెళ్లి పోయింది హుసేయిన్ కాగా జైల్లో ఉన్నది మూరత్.
విషయం తెలిసిన వెంటనే బయటకు వెళ్లిన హుసేయిన్ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.ఎంతకు అతడు దొరకలేదు.రెండు మూడు రోజుల తీవ్ర వెదుకులాట తర్వాత హుసేయిన్ తన ఇంట్లోనే పట్టుబడ్డాడు.
పట్టుబడ్డ హుసేయిన్ను జైలుకు తీసుకు వచ్చారు.ఇక జైలు అధికారులను మోసం చేసినందుకు గాను మూరత్ను కోర్టు ముందు హాజరు పర్చారు.
మోసం చేసినందుకు గాను మూరత్కు కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించడం జరిగింది.