ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ టీవీ9లో మొదటి నుండి కూడా న్యూస్ రీడర్గా చేస్తోన్న బద్రి నేడు ఉదయం పెళ్లికి వెళ్లి వస్తూ ప్రమాద వశాత్తు మరణించాడు.బద్రి ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి, రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది.
దాంతో డ్రైవింగ్ సీటులో ఉన్న బద్రి అక్కడిక్కడే మరణించాడు.కారులో బద్రితో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
పెద్ద కుమారుడు కూడా కొంత సమయానికి మరణించాడు.చిన్న కుమారుడు మరియు ఆయన భార్యను ప్రస్తుతం హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.మరి కొన్ని నిమిషాల్లో బద్రి గమ్య స్థానంకు చేరుకుంటాడు అనగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.బద్రి మరణంతో ఆయన సన్నిహితులు, బందువులు మరియు టీవీ9 ఉద్యోగులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.1977లో జన్మించిన బద్రి అసలు పేరు వీరభద్రయ.మొదట సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా కెరీర్ను ప్రారంభించిన బద్రి టీవీ9 ప్రారంభం నుండి కూడా న్యూస్ ప్రజెంటర్గా చేస్తూ వస్తున్నారు.