టీవీ9 జర్నలిస్ట్‌ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ డైరెక్టర్‌

సాయి దరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ నేపథ్యంలో టీవీ9 లో వచ్చిన కథనాల గురించి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.హరీష్‌ శంకర్‌ టీవీ9 కథనంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 Tv9 Journalist Harish Shankar Is Fighting About Sai Dharam Tej Accident, Film Ne-TeluguStop.com

న్యూస్ ను కాకుండా న్యూసెన్స్ ను చూపిస్తున్నారు అంటూ చాలా మంది కూడా కామెంట్స్ చేశాడు.హరీష్‌ శంకర్‌ చేసిన వ్యాఖ్యలకు టీవీ9 ఛానెల్‌ కు చెందిన ఒక జర్నలిస్ట్‌ దొంతు రమేష్‌ రియాక్ట్‌ అయ్యాడు.

మీరు సినిమాలు తీసి డబ్బులు సంపాదిస్తారు.సినిమాల్లో తప్పుడు సమాచారం.

తప్పుడు విషయాలను చెప్పి చూపించి కోట్లు సంపాదిస్తారు.మేము ఉన్న వాస్తవాలు చెబితే మాత్రం జీర్ణించుకోలేరా అంటూ ప్రశ్నించాడు.

హరీష్‌ శంకర్ కు కాస్త గట్టిగా తగిలే మాదిరిగానే ఈ విషయమై రమేష్‌ దొంతు రియాక్షన్ ఉండటంతో హాట్‌ టాపిక్ అయ్యింది.ఈ విషయమై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు హరీష్‌ శంకర్ కూడా రియాక్ట్‌ అయ్యాడు.

యాక్సిడెంట్ జరిగిన సమయంలో తేజ్ యొక్క పరిస్థితి గురించి రకరకాలుగా టీవీ9 లో వార్తలు వచ్చాయి.అందుకే చాలా మంది మెగా అభిమానులు మరియు హరీష్ శంకర్ కూడా టీవీ9 ను ట్రోల్‌ చేయడం జరిగింది.

జర్నలిస్ట్‌ లు అందరిని కూడా వారు కించపర్చినట్లుగా మాట్లాడుతున్నారు అంటూ దొంతు రమేష్ చేసిన వ్యాఖ్యలకు హరీష్‌ శంకర్ స్పందించాడు.

నేను ప్రత్యేకించి మీ పేరు తో విమర్శలు చేయలేదు.నేను జనరల్ గా మాత్రమే మాట్లాడాను.నిజంగా జర్నలిజం చేసిన వారు ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పుకార్లు వార్తలు రాయరు అంటూ హరీష్‌ శంకర్ మరింత కఠినంగా దొంతు రమేష్‌ కు వార్నింగ్‌ ఇచ్చినట్లుగా మాట్లాడాడు.

దాంతో వివాదం పెద్దది అయ్యింది.మరి ఈ విషయంలో ఇతర మెగా హీరోల స్పందన ఏంటీ అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube