తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ నుండి మూడవ వారం టీవీ9 దేవి నాగవల్లి ఎలిమినేట్ అయింది.ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరు కూడా ఊహించలేదు.
ఆమె కంటే బలహీనమైన కంటెస్టెంట్స్ కుమార్ సాయి, మెహబూబ్ మరియు అరియానా లు ఉన్నారని ఖచ్చితంగా ఆమెకు ఎలాంటి డేంజర్ ఉండదని అంతా భావించారు.కానీ అనూహ్యంగా టీవీ9 దేవికి తక్కువ ఓట్లు రావడంతో చేస్తున్నట్లుగా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రకటించారు.
దేవి ఎలిమనేట్ అవ్వడంతో మెజార్టీ ఇంటి సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.
నాగార్జున ఆ విషయం తెలియ చేసిన వెంటనే అంతా కూడా అవాక్కయ్యాను.టీవీ9 దేవి కి ఉన్న ఫాలోయింగ్ మరియు ఆమెకు ద్వారా వచ్చిన పాపులారిటీ కారణంగా ఆమె ఖచ్చితంగా ఫైనల్ వరకు ఉంటుందేమో అని అంతా భావించారు.దేవి ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
అందరూ ఆమె ఎలిమినేషన్ సరైన నిర్ణయం కాదనే అంటున్నారు.మరి కొందరు ఆమెను ప్రేక్షకులు అర్థం చేసుకోకపోవడం వల్ల ఓటు వేయలేదని, మరికొందరేమో ఆమె కచ్చితంగా సేవ్ అవుతుంది కనుక ఓట్లు వేయకున్నా ఏం కాదు అన్నట్లుగా భావించినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీవీ9 యాంకర్ లు మరియు కొందరు జర్నలిస్టులు కూడా ఆమె కోసం ప్రచారం చేయడం మొదలుపెట్టారు.కానీ ఆమెకు ఓట్లు వేసే విషయంలో మాత్రం చాలా మంది ఆసక్తి చూపించడం లేదని దీంతో నిరూపితమైంది.
మరి కొందరు మాత్రం మళ్లీ ఆమె హౌస్ లోకి వెళుతుంది ఏమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.మొత్తానికి ఈ వారంలో వెళ్లి పోతాము అనుకున్నాం మెహబూబ్ మరియు కుమార్ సాయి లకు మరో వారం ఛాన్స్ దక్కింది.
మరి ఈసారైనా వారిద్దరూ తమ సత్తా చాటుకుని ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేస్తారో లేదో చూడాలి.