అప్పట్లో బాలీవుడ్ సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఎంతగా కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అయితే ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నటులు తమపై జరిగినటువంటి లైంగిక వేధింపుల విషయాలను బహిరంగంగా చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు.
మరికొందరైతే ఈ విషయాలను ఎలా ఎదుర్కోవాలో సలహాలు ఇస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ మీటూ ఉద్యమం బెంగాలీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.
తాజాగా టీవీ సీరియల్ నటి రూపంజన మిత్ర ఓ ప్రముఖ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.అప్పట్లో తనకు భూమి కన్య అనే టీవీ సీరియల్ లో నటించే అవకాశం వచ్చిందని అన్నారు.
అయితే ఇందులో భాగంగా దర్శకుడు అరిందం సిల్తనని ఈ సీరియల్ కథాంశాన్ని చర్చించేందుకు తన ఆఫీసుకి పిలిచాడని, ఈ క్రమంలో ఓ గదిలోకి తీసుకెళ్లి తన భుజంపై చేయి వేసి నిమరడం మొదలు పెట్టాడని దాంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని తెలిపింది.అంతేగాక తాను ఆఫీసుకు వెళ్లిన సమయంలో అక్కడ ఎవరూ లేరని దాంతో మరింత భయం వేసిందని ఆమె అన్నారు.
అలాగే తాను అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా తన గది లోకి వస్తే బాగుండు అని అనుకుంటున్న సమయంలో అతడి భార్య వచ్చిందని దాంతో తను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆమె చెప్పుకొచ్చింది.అయితే ఈ విషయంపై స్పందించి నటువంటి అరిందం సిల్ మాత్రం నేను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించ లేదని ఆమె తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఉన్నారు.
.