తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.బుధవారం రాత్రి సమయంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడ్డారు.
ఈ క్రమంలోనే టీవీ నటి ని కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది.అంతేకాకుండా ఈ ఉగ్రదాడుల్లో ఆమె మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళితే.బూదగామ్ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్ చేసి కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు.
ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్ భట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.తీవ్ర గాయాలు అయిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అయితే ఈ ఘటనలో ఆమెతో పాటుగా ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్ జుబీర్ కు కూడా గాయం అయినట్లు పోలీసులు తెలిపారు.అయితే బాలుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఈ దాడులను నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులే ఈ దాడులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.అయితే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే ఈ ఘటన మరువకముందే 24 గంటల వ్యవధిలోనే కాశ్మీర్ లో మరోసారి ఉగ్రదాడి చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ దాడుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు.అయితే నటి అమ్రీన్ భట్ మృతి విషయం తెలుసుకున్న ఆమె తోటి నటీనటులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
ఈ రెండు ఘటనలతో స్థానికంగా ఉండే ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు.అంతేకాకుండా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.
ఈ రెండు ఘటనతో పోలీసు సిబ్బంది కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.