ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత వేగంగా విజృంభిస్తుంది.రోజుకు కేసులు పెరుగుతున్న క్రమంలో ఏమి చేయలేని పరిస్థితిగా మారింది.
ఇక ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారు.సరిగ్గా వైద్య సౌకర్యాలు, సదుపాయాలు లేక అల్లాడిపోతున్నారు.
ఆక్సిజన్ కోసం కొట్టుమిట్టుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ నటుడు ప్రజల కోసం ఆసుపత్రి కట్టిస్తాం అంటూ ముందుకొచ్చాడు.
ఇప్పటికీ టాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తున్న సహాయం గురించి ఎవ్వరు మర్చిపోలేదు.గత ఏడాది నుండి ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ వస్తున్న సోనూ.ఈ సెకండ్ వేవ్ తీవ్రతలో కూడా ముందుకు వస్తున్నాడు.ఇక ప్రస్తుతం మరో హిందీ టీవీ నటుడు గుర్మీత్ చౌదరి కూడా తన వంతు సహాయం తో ముందుకు వచ్చారు.
సోషల్ మీడియా వేదికగా ఆదివారం రోజు ప్రజలకు సహాయం చేస్తానంటూ కొన్ని విషయాలు పంచుకున్నాడు.
కోవిడ్ పేషెంట్లకు సరైన వైద్యం అందించే ఆస్పత్రిలు తక్కువగా ఉన్నాయని అర్థం చేసుకొని తానే ఓ ఆసుపత్రి నిర్మిస్తానని తెలిపారు.పాట్నా, లక్నోలో ఈ హాస్పిటల్ ను త్వరలోనే ప్రారంభిస్తానని తెలిపాడు.సామాన్యులకు వైద్య సాయం అందించడం కోసం వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మిస్తానని తెలిపాడు.
అంతేకాకుండా ఈ ఆశయం గురించి తనకు అండగా ఉంటారని అభిమానులతో పంచుకున్నాడు.ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గురించి త్వరలోనే తెలుపుతామని, అవసరమైన వారికి ప్లాస్మా దానం అందేలా, ఆక్సిజన్ అందేలా, పేషెంట్లకు బెడ్ ల సౌకర్యం దొరికేలా చూసుకుంటానని తెలిపాడు.
ఇక ఈయన, ఈయన భార్య గత ఏడాది వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.ఇక వీరు వైరస్ నుండి కోలుకున్నాక.
ప్లాస్మాదానం కూడా చేసారు.