టీవీ9 లో చానల్ యాజమాన్యంలో అంతర్గత కలహాలకి మొత్తానికి ఒక ముగింపు వచ్చింది.గత రెండు రోజులుగా టీవీ 9 చానల్ పై ఐటీ రైడ్స్ అని, రవి ప్రకాష్ ని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని రకరకాల విషయాలు వినిపించాయి.
తెలుగు రాష్ట్రాలలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.అయితే ఇంత కాలం రాష్ట్రంలో జరిగే విషయాలకి తనదైన భాష్యం చెప్పి పాపులర్ అయిన ఈ చానల్ తాజాగా అలాంటి వ్యవహారమే తన విషయంలో కూడా జరిగి ఉక్కిరి బిక్కిరి అయిపొయింది.
ముఖ్యంగా టీవీ 9 సిఈఓ రవి ప్రకాష్ ఈ వ్యవహారంలో మెయిన్ గా కార్నర్ అయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా టీవీ 9 యాజమాన్యం మీడియా ముందుకొచ్చింది.
చానల్ నుంచి సిఈఓ గా ఉన్న రవి ప్రకాష్, అలాగే న్యూస్ హెడ్ గా ఉన్న మూర్తిని తొలగిస్తున్నట్లు, వారికి చానల్ తో ఇకపై ఎలాంటి సంబంధాలు ఉండవని తేల్చేసింది.అదే సమయంలో కొత్త సిఈఓగా మహేంద్ర మిశ్రా ని నియమించింది.
దీంతో రెండు రోజుల పాటు సాగిన ఈ వ్యవహారానికి ముగింపు పడినట్లు అయ్యింది.అయితే ఇప్పుడు రవి ప్రకాష్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనే విషయం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అతని చేతిలో ఉన్న టీవీ 1 న్యూస్ చానల్ పై ద్రుష్టి పెట్టి దానిని టాప్ లోకి తీసుకు రావడం, లేదంటే మరో కొత్త చానల్ మొదలెట్టి మళ్ళీ తన సత్తా నిరూపించుకోవడం అని మాటలు బలంగా వినిపిస్తున్నాయి.రవి ప్రకాష్ కూడా వీటిపైనే తన ద్రుష్టి పెట్టినట్లు కూడా టాక్ వినిపిస్తుంది.