తాబేళ్లు మనకు కనిపించడమే అరుదు.కానీ ఒడిశాలోని గహిర్మాతా బీచ్ తీరానికి మాత్రం ఏకంగా రెండు కోట్ల తాబేళ్లు కనిపించాయి.
అసలు ఎందుకు కనిపించాయి? అసలు ఎందుకు వచ్చాయి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న! తాబేళ్లు ప్రతి ఏడాది గుడ్లు పెట్టడానికి సముద్రం నుండి ఇలా వడ్డుకు వస్తాయట.
అలానే తాబేళ్లు పొదిగిన తర్వాత వాటి పిల్లలు ఉండడానికి ఇసుక గూళ్లు తయారు చేస్తాయ్.
అరిబాడాగా పిలిచే ఈ ప్రక్రియ కొన్ని రోజుల పాటు జరుగుతుంది.అలా జరిగాకా తాబేళ్ల పిల్లలు కాస్త ఎదిగిన వెంటనే ఒకేసారి తాబేలు పిల్లలు అన్నీ కలిసి మళ్లీ సముద్రం అడుగుకు వెళ్లిపోతాయి.
అలానే తాజాగా లక్షలాది తాబేళ్లు సముద్ర తీరానికి వచ్చాయి.అది కాస్త వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఇంకా ఆ వీడియోని ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుషాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.
అంతే కాదు.ఈ వీడియోని చుసిన అందరూ కూడా తెగ షేర్లు చేస్తున్నారు.