సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి.సోషల్ మీడియా వలన మనకు తెలియని చాలా చిత్ర విచిత్రమైన విషయాలు మనకు తెలుస్తున్నాయి.
కొన్ని చూడడానికి ఆశ్చర్యంగా ఉంటే మరికొన్ని మాత్రం ఫన్నీగా ఉంటాయి.అలాగే కొన్ని జంతువుల వీడియోలో చూడడానికి భయంగా ఉంటాయి.
మరికొన్ని వీడియోలు మాత్రం మనసుకు చేరువ అవుతాయి.మళ్ళీ మళ్ళీ ఆ వీడియోలను చూడాలనిపిస్తుందన్నమాట.
ఈ క్రమంలో ఇప్పుడు అయితే రెండు జంతువుల మధ్య గల స్నేహ బంధానికి నిదర్శనంగా కనిపించే ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
ఒకటా రెండా పెద్ద సంఖ్యలో తాబేళ్లు గుంపు ఒకటి హిప్పోతో స్నేహం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సాధారణంగా జంతువులు గాని పక్షులు గాని వేరే వాటితో జత కట్టి స్నేహం చేయడం అనేది మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము.ఉదాహరణకి పక్షులు పక్షులతోనే స్నేహం చేస్తాయి.
జింకలు జింకలతోనే స్నేహంగా ఉంటాయి.వేరే జాతికి చెందిన జంతువులతో అంత త్వరగా కలిసిపోలేవు.
కానీ హిప్పోతో చక్కగా తాబేళ్ల గుంపు కలిసిపోయి దాని మీద ఎక్కి సవారీ కూడా చేస్తున్నాయి.తాజాగా ఈ తాబేళ్లకు సంబంధించిన వీడియోను వీక్షకులు బాగా లైక్ చేస్తున్నారు.
ఒక అడవిలోని నీటి కొలనులో ఒక భారీ హిప్పో చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ నీటిలో పనుకుంది.హిప్పోను చుసిన తాబేళ్లు గుంపు దాని దగ్గరకు వచ్చి హిప్పో వీపుపైకి చకచకా మంటూ ఎక్కేశాయి.కొద్ది సేపు అయ్యాక హిప్పో నీటిలో నుంచి పైకి లేచి అడుగులు వేసే క్రమంలో కొన్ని తాబేళ్లు మళ్ళీ నీటిలో పడిపోవడం మనం గమనించవచ్చు.ఎంతయినా తాబేలు తెలివే తెలివి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఇంత అద్భుతమైన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.అలాగే ఒక్కోసారి ఫ్రీ రైడ్స్ కూడా కొంచెం రిస్కీ గానే ఉంటాయని కామెంట్ కూడా పెట్టారు.
ఏది ఏమయినా ఈ వీడియో మాత్రం అందరిని బాగా ఆకట్టుకుంటుంది.