తెలంగాణ రాష్ట్రంలో నిన్న సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.ఈ కేసుకు సంబంధించి యువతిని ప్రశ్నించడంతో కొత్త కోణం వెలుగు చూసింది.
అదేమంటే.నిన్న సాయంత్రం ఆటో ఎక్కిన ఈ యువతి తనను ఆటో డ్రైవర్ అపహరించాడంటూ తల్లికి చేసిన ఫోన్ కాల్ ఫేక్ అని తేలిందట.
తల్లితో పాటుగా పోలీసులను కూడా తప్పుదోవ పట్టించిన ఈ యువతి చెప్పిన నిజాలు వింటే షాక్ అవడం ఖాయం.ఇకపోతే తొలుత బీఫార్మసీ విద్యార్థి ఆటో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లి అక్కడి నుండి తన ప్రియుడితో కలిసి టూ వీలర్ పై వెళ్లిందని విచారణలో తేలిందట.
ఈ క్రమంలో ఒక ప్రదేశంలో అతని ఇద్దరు సోదరులతో కలిసి గంజాయి తీసుకున్నట్లు వెల్లడైందట.కాగా ఆ మత్తులో ఈ యువతి అనుమతితో వారంతా అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణ లో తెలిసిందట.
అయితే తన తల్లి తరచూ ఫోన్ చేస్తుండటంతో ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని అబద్ధం చెప్పింది.దీంతో భయపడిన తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, అప్రమత్తమైన పోలీసులు సైరన్లు పెట్టుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ విషయం తెలిసిన ఆ యువకులు ఆమెను రహదారి పక్కన వదిలేసి వెళ్లిపోగా ఈ యువతిని వెతుకుతున్న గస్తీ పోలీసుల కంటపడిందట.అప్పటికే మత్తులో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.
అనంతరం యువతిని ప్రశ్నించగా కొత్త డ్రామాకు తెరలేపిన, ఆ పప్పులేవి ఉడకలేదు.ఇక పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా యువతి ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది.
దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.