ట్యూషన్ పేరుతో ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు.విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఈ యువతిని బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ట్యూషన్ కు వచ్చిన అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు.భయంతో ఆ యువతి బయటకు చెప్పకపోవడంతో అలుసుగా భావించి కేక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేస్తూ వీడియోను చిత్రీకరించాడు.
బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతుండటంతో యువతి గర్భవతి అయింది.విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.యువతిపై ట్యూషన్ పేరుతో ఓ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన అస్సాం రాష్ట్రంలోని దిబ్రునగర్ లో చోటు చేసుకుంది.కరోనా లాక్ డౌన్ కారణంగా కాలేజీలు మూతబడ్డాయి.ఈ తరుణంలో దిబ్రునగర్ కు చెందిన ఓ ఉపాధ్యాయుడు ప్రైవేట్ ట్యూషన్ చెప్తున్నాడు.
ట్యూషన్ కు వెళ్తే చదువుకోవచ్చని ఓ యువతి అందులో జాయిన్ అయింది.యువతిని చూసిన ట్యూషన్ మాస్టర్ ఆమెపై కన్నేశాడు.
డౌట్స్ క్లియర్ చేస్తానని అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.భయంతో ఆ అమ్మాయి ఎవరికీ చెప్పకపోవడంతో మరింత రెచ్చిపోయాడు.
పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో యువతి గర్భవతి అయింది.ఇంట్లో వాళ్లకు తెలియడంతో ఆ మాస్టారును పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించించారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.