నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ 23న రిలీజ్ కి రెడీ అయ్యింది.
అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో పాటు బయట పరిస్థితి ప్రమాదకరంగా మారింది.ఈ అలాగే థియేటర్స్ కి కూడా ప్రేక్షకులు రావడానికి ఇష్టపడటం లేదు.
ఈ నేపధ్యంలో సినిమాని రిలీజ్ వాయిదా వేసేశారు.ఇప్పుడు రిలీజ్ అనేది త్వరలో ప్రకటిస్తామని కూడా చెప్పారు.
అయితే గత ఏడాది వి సినిమాకి కూడా ఇదే పరిస్థితి వచ్చి.సినిమా రిలీజ్ సమయానికి కరోనా లాక్ డౌన్ రావడంతో కొన్ని నెలలు వాయిదా వేశారు.
ఫైనల్ గా దిల్ రాజు ఒటీటీ రిలీజ్ వైపు మొగ్గు చూపించారు.అయితే ఒటీటీలో రిలీజ్ అయిన సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.
ఇదిలా ఉంటే టక్ జగదీష్ సినిమాకి కూడా మళ్ళీ అలంటి పరిస్థితే ఎదురైంది.అయితే సినిమాకి పాజిటివ్ టాక్ ఉండటం కొంత అనుకూలించే అంశం.అయినా కూడా మళ్ళీ ఈ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎప్పటికి తగ్గుతుంది అనేది అర్ధం కాని విషయంగా ఉంది.ఈ నేపధ్యంలో టక్ జగదీష్ సినిమాని ఒటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ ప్రచారాన్ని తాజాగా హీరో నాని ఖండించారు.టక్ జగదీష్ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్ కి వెళ్లి హ్యాపీగా చూసి ఆస్వాదించాల్సిన సినిమా అని చెప్పాడు.
దీనిని ఒటీటీలో రిలీజ్ చేసే అవకాశమే లేదని తేల్చేశాడు.ఎప్పుడు రిలీజ్ అయిన నేరుగా థియేటర్ లోనే వస్తుందని స్పష్టం చేశాడు.