మినిమం గ్యారెంటీ హీరో అయిన నాని ప్రస్తుతం ‘వి’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో విలన్ అవతారమెత్తిన నాని ప్రేక్షకులను మెప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత నాని తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్గా ప్రారంభించిన చిత్ర యూనిట్, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టనుంది.
నిన్ను కోరి వంటి సూపర్ హిట్ అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో నాని ఈ సినిమాను చేయనుండటంతో ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇక ఈ సినిమాలో నాని పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని, ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే ట్విస్టుతో నాని పాత్ర ఎలా ఛేంజ్ అవుతుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మరో కీలకపాత్రలో జగపతి బాబు నటిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమా మణిరత్నం తెరకెక్కించిన ఘర్షణ సినిమాను పోలి ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మొత్తానికి సినిమా మొదలు కాకముందే ఇలాంటి వార్తలు వస్తుండటంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.