అమెరికాలో ముగ్గురు తెలుగు విద్యార్ధులు మృతి

అమెరికాలో లో భారతీయ విద్యార్ధుల వరుస మరణాలు భారత్ లో ఉంటున్న ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తున్నాయి.అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో తాజాగా జరిగిన నీటి ప్రమాద సంఘటనలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కు చెందిన ముగ్గురు తెలుగు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు మృతి చెందిన వారిలో చెన్నారెడ్డి కేదార్నాథ్, ఓలేటి తేజ, కొయ్యాల మూడి అజయ్ ఉన్నారు.

 Tthree Ut Arlington Telugu Students Dead In Oklahoma Usa Nri1-TeluguStop.com

ఇదిలాఉంటే మృతి చెందినా ముగ్గురిలో కేదారినాథ్ నెల రోజుల క్రితమే అమెరికా వచ్చారని, అజయ్, తేజ ఇద్దరు అమెరికా వచ్చి ఆరు నెలలు అవుతోందని, వీరు ముగ్గురు టర్నర్స్ క్రీక్ పార్క్ వెళ్లి అక్కడ జరిగిన నీటి ప్రమాదంలో మృతి చెందారని స్థానిక పోలీసులు తెలిపారు.ఇది ప్రమాద వశాత్తు జరిగిన సంఘటనే అని అన్నారు.

Telugu Oklahoma Usa, Telugu, Ut Arlington-

వీరిలో ముందుగా ఒకరి నీటిలో మునిగిపోతుండగా, మరొకరుగా కాపాడేందుకు ప్రయత్నించి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.తేజ, అజయ్ , కేదార్నాథ్ ముగ్గురి మృతదేహాలు గురువారం డల్లాస్ రానున్నాయని, ఆ తరువాత వీరి ముగ్గురి మృతదేహాలను భారత్ కి పంపేందుకు భారతీయ కాన్సులేట్ అధికారులతో తానా టీమ్ స్క్వేర్ అధ్యక్షుడు అశోక్ బాబు ఆయన టీం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube