ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ,ఏక పక్ష పాలనను నిరంకుశ వైఖరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడమే కాకుండా ఓటమిని చక్కగా బహుకరించారు .ఇంతకంటే ప్రజల ఈసడింపు ఏముంటుంది అని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు కెసిఆరును తీవ్రంగా విమర్శించారు .
ఆయన మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఒక్క ప్రజా సమస్యను కూడా పరిష్కారం లేదు సరికదా ప్రతిపక్షాన్ని అకారణంగా సభ నుంచి వెల్లగోట్టిన ఘనచారిత్రకారుడు అని దుయ్యబట్టారు .ప్రజలు కేసీఆర్ పై ఉన్నఈసడింపు ను కోపాన్ని ఉద్యమనేత దేవీప్రసాద్ పై చూపించారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతో టిడిపి ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారన్నారు.జాతీయ గీతం సందర్భంగా తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్తామన్నప్పటికీ స్పీకర్ పట్టించుకోలేదని ఎర్రబెల్లి అన్నారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలంగాణకు పక్కా వ్యతిరేకులని ఎర్రబెల్లి మండిపడ్డారు.