గతాన్ని మరచిపోయి.తెలంగాణా కోసం పోరాటం చేసిన వారిని వదిలేసి ఉద్యమానికి ద్రోహం చేసిన వారికే కేసీఆర్ పట్టం కడుతున్నారు అని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ పై నిప్పులు చేరిగారు.
ఆయన మాట్లాడుతూ…టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు, ఉద్యమానికి ద్రోహం తలపెట్టినవారంతా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారని, మహబూబాబాద్లో ఉద్యమకారులపై రాళ్ళు రువ్విన, తూటాలు పేల్చిన కొండా సురేఖ, కొండా మురళీ ఇప్పుడు ఎక్కడున్నారో అందరికి తెలుసు.తెలంగాణ అంటేనే భగ్గుమనే తుమ్మల , తలసాని శ్రీనివాస్లకు మంత్రి పదవులు ఇవ్వలేదా? అని కేసీఆర్ ను ఎర్రబల్లి ప్రశ్నించారు.తన బండారం ఎక్కడ బయటపడుతుందోని, కార్యకర్తలు ఎక్కడ నిలదీస్తారోనని భయపడడం వల్లనే హైదారాబాద్లో ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్ల్లీనరీ సమావేశంలో కేసీఆర్ కార్యకర్త లెవ్వరికి మాట్లాడానికి అవకాశం ఇవ్వలేదనీ, మూర్ఖంగా తానొక్కడే మాట్లాడి సభను ముగించారన్నారు.రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని, ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పటికి భవిష్యత్ తమ పార్టీదేనన్నారు.
ఈ నెల 12వ తేదీన వరంగల్లో జరిగే టీడీపీ ప్రతినిధు సభలో పాల్గొనేందుకు పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నారని తెలిపారు.మరి దీనిపై తెరాస కౌంటర్ కు సిద్దం అవుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.
చూడాలి మరి ఏం జరుగుతుందో.