కరోనా వైరస్.ప్రపంచ ప్రజల జీవన విధానంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది.ఇన్నాళ్లు ఉన్నట్టు ఎక్కడంటే అక్కడ.ఎలా అంటే ఆలా కలిసి తిరిగే అవకాశం కరోనా ఎవరికి ఇవ్వదు.భౌతిక దూరం పాటించడం.మాస్కు ధరించడం అనేవి తప్పనిసరి అవ్వనున్నాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి దర్శన పద్ధతిలోను మార్పులు జరగనున్నాయి.
ప్రపంచ దేశాల ప్రజలంతా మన భారత్ లో మన ఆంధ్రలోని తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి వస్తుంటారు.
కొన్ని కోట్లమంది నిత్య శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు… దీంతో తిరుమల ఎప్పుడు రద్దీ రద్దీగా ఉంటుంది.ఇంకా అలాంటి ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా గత 45 రోజుల నుండి మూసుకుపోయింది.
అయితే లాక్ డౌన్ తర్వాత కూడా శ్రీవారి దర్శన పద్దతిలో మార్పులు ఉంటాయి అని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
భక్తులు భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం వంటి మార్పులు చేస్తామని స్పష్టం చేశారు వైవి సుబ్బారెడ్డి.
కేవలం తిరుమలలోనే కాదు ఇంటి నుండి బయటకు వస్తే మాస్క్ ధరించడం, చేతిలో శానిటైజర్ అనేది తప్పనిసరి.ఎందుకంటే కాలం బాలేదు.
ఇలా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం.ఆనందంగా జీవిస్తాం.