మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల దర్శనాల విషయంలో ప్రభుత్వాలు అనేక షరతులతో కూడిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగానే తిరుమల తిరుపతి విషయంలో కూడా సర్వదర్శనం ఈ విషయంలో కేవలం 10 వేల మందికి మాత్రమే టోకెన్లు కేటాయించడం జరిగింది.
కాగా ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం టోకెన్లను పెంచడం జరిగింది.
టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంతో తిరుమల తిరుపతి భక్తులు ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు.
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల కొండ మొన్నటి వరకు కరోనా నిబంధనల దెబ్బకి చాలావరకు బోసి పోయినట్లు ఉంది.తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి కొండ భక్తులతో కిటకిటలాడటం గ్యారెంటీ అని తాజా నిర్ణయం బట్టి తెలుస్తోంది.
ఇదిలా ఉంటే టికెట్లు పొందుతున్న భక్తులు యధావిధిగా కరోనా నిబంధనలను పాటించాలని, మాస్క్ ధరించి రావాలని, చేతులను శానిటైజ్ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని టీటీడీ పేర్కొంది.