కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన మార్గం.దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విషయాన్ని చెబూన్నారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నారు.దేశవ్యాప్తమంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.
ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ప్రచారం చేస్తూ ప్రజలందరికి ఫ్రీగానే వ్యాక్సిన్ అందిస్తున్నారు.ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయిస్తుంది.
టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 45 ఏళ్లు పై బడిన వారు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారు ఉన్నారని తెలుస్తుంది.అయితే అలాంటి వారికి జీతాలు నిలిపివేయాలని ఈవో జవహర్ రెడ్డి ఆఏశాలు జారీ చేశారు.
చాలామంది ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకోలేదని సమాచారం రావడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.జూలై 7 లోపు అందరు ఎంప్లొయీస్ వ్యాక్సిన్ వేయించుకుని సంబంధిత సర్టిఫికెట్లు డిపార్ట్మెంట్ లలో అందచేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు.
జూలై 7 లోపు వ్యాక్సిన్ వేసుకున్న వారికి 8న శాలరీస్ చెల్లిస్తారని.సెకండ్ వేవ్ తగ్గుముకం పడుతుండటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.త్వరలో సర్వదర్శనం కూడా అమలు చేస్తారని ఈలోగా ఉద్యోగులు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు.కొందరు ఉద్యోగులు ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే వారికి జీతాలు కట్ చేస్తారని తెలుస్తుంది.